హైదరాబాద్ తెలంగాణ కానుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను టీపీసీసీ ఫిషర్మెన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు లేదని ఆయన అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వివాదాలు, ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్న నాయకులు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుండా అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారిందన్నారు. అలాంటి పార్టీకి చెందిన నాయకులు ఇప్పుడు నీతులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రజల మద్దతుతో నిర్మించుకున్న నాయకుడని,
మహేశ్వరం తెలంగాణ కానుక మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలోనీ శ్రీ సాయిబాబా* ఆలయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ మెంబర్ *దేప భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి సాయిబాబా స్వామి వారికి ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ బాబా ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, కాలనీ సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ చిలుక ఉపేందర్ రెడ్డి రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్, తలాటి రమేష్ నేత, రామకృష్ణ గౌడ్,సుదర్శన్, రమేష్ గౌడ్, కాలిని వాసులు కృష్ణారావు, నాగేష్
తాండూర్ తెలంగాణ కానుక ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసి యేషన్ తాండూర్.. ఆధ్వ ర్యంలో లోక కళ్యాణా ర్థం కోసం వర్షాలు సమృద్ధి గా పడి, పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుభి క్షంగా ఉండాలని.. మహా శివుడికి జలాభిషేకం, వరుణ యాగం, పూర్ణా హుతి వైభవంగా నిర్వహిం చారు.కార్యక్రమానికి ఎమ్మె ల్యే మనోహర్ రెడ్డి, మున్సి పల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు, నాయకులు హాజరై పూజ లు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడు తూ..చెరువులు నీరు లేక వెల వెల బోతున్నాయని, బోర్లలో నీరు తగ్గడం వల్ల పంటలు ఎండిపోతు న్నాయని అన్నారు.ముఖ్యంగా ఏ ప్రాణికైనా నీళ్లే ఆధారమని, వర్షాలు బాగా కురవాలని పంటలు పండాలని దేవుడిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ నర్సిములు, కాంగ్రెస్ నాయకులు, రైతులు,
బండ్లగూడ తెలంగాణ కానుక కాలనీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని దన్నాడ లక్ష్మణ్ కోరారు.రాజేంద్రనగర్ సర్కిల్ 123వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ. 12 లక్ష్యాల నిధులు మంజూరు కావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు సహకరించిన అధికారులకు మాజీ ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇందిరానగర్ కాలనీలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు. ఇందిరానగర్ కాలనీలో ని అన్ని సమస్యల పరిష్కరించడానికి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు సాయినాథ్, జనరల్ సెక్యూరిటీ నాగరాజు, ప్రచార కార్యదర్శి శివకుమార్, మహిళా ప్రతినిధి శాంతి నాయక్,దేవదయాశక అధ్యక్షుడు పి. శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ మల్లేష్, యాదగిరి,సిద్దప్ప కాలనీ
మణికొండ: తెలంగాణ కానుక నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ, నెక్నంపూర్ డివిజన్లలో నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతి పొందిన అంతస్తులకు అదనంగా మరో అంతస్తు, పెంట్హౌస్లు నిర్మించడం నాలాలను కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. సెట్బ్యాక్లు, ఇంకుడు గుంతలు లేకుండానే నిర్మాణాలు పూర్తవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల జి+3 అనుమతి తీసుకుని జి+5తో పాటు అదనపు పెంట్హౌస్లు నిర్మిస్తున్నారని, నిర్మాణాలు పూర్తయ్యాక నీరు, విద్యుత్ కనెక్షన్లు కూడా లభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పలు కాలనీల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు నార్సింగి సర్కిల్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్, పంచవటి కాలనీ, శివపురి కాలనీ, తిరుమల హిల్స్, బయోత్ కాలనీ, పయనీర్ కాలనీ, లక్ష్మీనగర్, హనుమాన్
