మెహిది పట్నం: మర్చి 17 తెలంగాణ కానుక జిహెచ్ఎంసి మాసాబ్ ట్యాంక్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మించిన షాపులను సీజ్ చేశారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమంగా నిర్మాణం చేసిన షాపులకు సీల్ వేశారు. విజయనగర్ కాలనీ ప్రధాన రహదారి లో కింగ్ చాట్ బండార్ వద్ద అక్రమంగా షాపులు నిర్మించారు. స్థలం తమదని ఒకరు..మరొకరు ఏకంగా ఆ స్థలంలో నిర్మాణాలు చేయటంతో ఇద్దరి మధ్య గొడవ ఫిర్యాధుల నేపథ్యంలో జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు.ఇక ముందు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సీరియస్ చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ సీజింగ్ ప్రక్రియ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నిందితుడికి 14 రోజుల రిమాండ్……. ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న స్టార్ తాబేలును రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది పట్టుకున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం రావడంతో సికింద్రాబాద్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డగుట్టకు చెందిన సురేష్ కుమార్ (32) అనే ప్రయాణికుడు భువనగిరి నుంచి సికింద్రాబాద్కు వస్తూన్నప్పుడు తనిఖీలలో భాగంగా తను తాబేలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని RPF పోలీస్ స్టేషన్ కు తరలించారు.తరువాత ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వారు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు..న్యాయస్థానం నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు హైద్రాబాద్ డీఎఫ్ఓ శ్రీనివాస్ తెలిపారు..
జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలను అడుగడుగునా అవమానిస్తూ, ఆత్మగౌరవాన్ని, ధెబ్బతీస్తు బీసీల ద్రోహిగా మారి, కులగజ్జితో వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను తొలగించి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం చూస్తే బీసీలపై ఆయనకు బిసిల పట్ల పచ్చి వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టం అవుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన 240 అభివృద్ధి పనుల బుక్ లెట్ ను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి అందజేసి అభివృద్ధి పనులను వివరించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి *well-done శ్రీధర్ రెడ్డి చాలా బాగా చేస్తున్నావు.keep it up అలాగే కొనసాగించమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. ఆమంచర్ల సెజ్ మరియు త్వరలో ప్రారంభం కానున్న రైల్వే అండర్ బ్రిడ్జిల గురించి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర ప్రస్తావించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పథకాలను రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వసంత నగర్ లో శ్రీవాణి అనే మహిళ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఇవానియా బ్యూటీ పార్లర్ ను ఆయన టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు తమకు తామే అవకాశాలను సృష్టించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు సంకల్పం దీక్ష పట్టుదల ఉంటే తాము అనుకుంటే మహిళలు ఏదైనా సాధించగలరన్నారు. శిక్షణ పొందతాము కూడా స్వయం ఉపాధిని పొంది ఆర్థికంగా నిలబడతారన్నారు. టీజీ ఐఐసీ చైర్మన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందన్నారు. మరిన్ని బ్యూటీ పార్లర్లను ఏర్పాటు చేయాలని శ్రీ వాణి ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశ భావం వ్యక్తం చేశారు
