ముఖ్యాంశాలు

తెలంగాణ

ఘనంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వీడ్కోలు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. సహచర ఐపీఎస్ అధికారులతో కలిసి డీజీపీకి సాదర వీడ్కోలు పలికారు. రాష్ట్ర పోలీసు శాఖ అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు శివధర్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వం పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల దాడులు

రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఇంటి పన్ను విషయంలో బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి బిల్ కలెక్టర్‌ను ట్రాప్ చేసిన ఏసీబీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని సూచన

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: మంత్రి శ్రీధర్ బాబు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశించిన లక్ష్యాల మేరకు ముందుకు సాగాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏటా 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గురువారం నాడు హిమాయత్ నగర్ లోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 శాసనసభ నియోజకవర్గాల ఇందిరమ్మ ఇళ్ల పనుల సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రెవిన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, లక్ష్మణకుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీలు, ఎంఎల్యేలు, ఎంఎల్సీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ వి.పి గౌతమ్, కలెక్టర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని

ప్లాస్టిక్ మృత్యుజాలం: అంతర్వేదిలో అస్థిపంజరంగా మారిన పశువు

అంతర్వేది తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఓ పశువు మృతి చెందిన ఘటన పర్యావరణ కాలుష్యంపై ఆందోళన కలిగిస్తోంది. ఆకలితో పశువు ప్లాస్టిక్ సంచులను ఆహారంగా భావించి మింగడంతో ప్రాణాలు కోల్పోయింది. జంతువు శరీరం కుళ్లి అస్థిపంజరంగా మారినా, దాని కడుపులోని ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండటం ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో చాటిచెబుతోంది. నిర్లక్ష్యంగా పారేసే వ్యర్థాల వల్ల వేలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విజయనగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన షాపుల సీజ్ …..

మెహిది పట్నం: మర్చి 17 తెలంగాణ కానుక జిహెచ్ఎంసి మాసాబ్ ట్యాంక్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మించిన షాపులను సీజ్ చేశారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమంగా నిర్మాణం చేసిన షాపులకు సీల్ వేశారు. విజయనగర్ కాలనీ ప్రధాన రహదారి లో కింగ్ చాట్ బండార్ వద్ద అక్రమంగా షాపులు నిర్మించారు. స్థలం తమదని ఒకరు..మరొకరు ఏకంగా ఆ స్థలంలో నిర్మాణాలు చేయటంతో ఇద్దరి మధ్య గొడవ ఫిర్యాధుల నేపథ్యంలో జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు.ఇక ముందు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సీరియస్ చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ సీజింగ్ ప్రక్రియ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సినిమా

రాజకీయాలు

వీడియోలు