ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో తెలుగు తేజాల ప్రతిభ.

Spread the love

వార్సా (పోలాండ్) వేదికగా జరిగిన 2025 ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి పతకాలు సాధించిన తెలుగు క్రీడాతేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కోనేరు హంపి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోగా, ఓపెన్ విభాగంలో తెలంగాణ యువ చెస్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి కాంస్య పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచారు.దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు ఈ విజయాలు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. నైపుణ్యం, పట్టుదల, నిరంతర సాధనతో హంపి, అర్జున్‌లు సాధించిన ఈ విజయం అంతర్జాతీయ చెస్ వేదికపై భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *