ఘనంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వీడ్కోలు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. సహచర ఐపీఎస్ అధికారులతో కలిసి డీజీపీకి సాదర వీడ్కోలు పలికారు. రాష్ట్ర పోలీసు శాఖ అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు శివధర్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వం పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Read More

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల దాడులు

రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఇంటి పన్ను విషయంలో బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి బిల్ కలెక్టర్‌ను ట్రాప్ చేసిన ఏసీబీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని సూచన

Read More

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: మంత్రి శ్రీధర్ బాబు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశించిన లక్ష్యాల మేరకు ముందుకు సాగాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏటా 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గురువారం నాడు హిమాయత్ నగర్ లోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 శాసనసభ నియోజకవర్గాల…

Read More

ప్లాస్టిక్ మృత్యుజాలం: అంతర్వేదిలో అస్థిపంజరంగా మారిన పశువు

అంతర్వేది తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఓ పశువు మృతి చెందిన ఘటన పర్యావరణ కాలుష్యంపై ఆందోళన కలిగిస్తోంది. ఆకలితో పశువు ప్లాస్టిక్ సంచులను ఆహారంగా భావించి మింగడంతో ప్రాణాలు కోల్పోయింది. జంతువు శరీరం కుళ్లి అస్థిపంజరంగా మారినా, దాని కడుపులోని ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండటం ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో చాటిచెబుతోంది. నిర్లక్ష్యంగా పారేసే వ్యర్థాల వల్ల వేలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు…

Read More

విజయనగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన షాపుల సీజ్ …..

మెహిది పట్నం: మర్చి 17 తెలంగాణ కానుక జిహెచ్ఎంసి మాసాబ్ ట్యాంక్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మించిన షాపులను సీజ్ చేశారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమంగా నిర్మాణం చేసిన షాపులకు సీల్ వేశారు. విజయనగర్ కాలనీ ప్రధాన రహదారి లో కింగ్ చాట్ బండార్ వద్ద అక్రమంగా షాపులు నిర్మించారు. స్థలం తమదని ఒకరు..మరొకరు ఏకంగా ఆ స్థలంలో నిర్మాణాలు చేయటంతో ఇద్దరి మధ్య గొడవ…

Read More

రైలులో స్టార్ తాబేలు పట్టివేత.

నిందితుడికి 14 రోజుల రిమాండ్……. ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న స్టార్ తాబేలును రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది పట్టుకున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం రావడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డగుట్టకు చెందిన సురేష్ కుమార్ (32) అనే ప్రయాణికుడు భువనగిరి నుంచి సికింద్రాబాద్‌కు వస్తూన్నప్పుడు తనిఖీలలో భాగంగా తను తాబేలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని RPF పోలీస్ స్టేషన్ కు తరలించారు.తరువాత ఈ…

Read More

బీసీల ద్రోహి కోమటిరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించాలి జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్.

జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలను అడుగడుగునా అవమానిస్తూ, ఆత్మగౌరవాన్ని, ధెబ్బతీస్తు బీసీల ద్రోహిగా మారి, కులగజ్జితో వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు

Read More

చంద్రబాబును కలిసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన 240 అభివృద్ధి పనుల బుక్ లెట్ ను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి అందజేసి అభివృద్ధి పనులను వివరించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి *well-done శ్రీధర్ రెడ్డి చాలా బాగా చేస్తున్నావు.keep it up అలాగే కొనసాగించమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు….

Read More

జనసేన ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న పవన్.

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు నియోజక వర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస రావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య తదితరులు హాజరయ్యారు.

Read More

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పథకాలను రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వసంత నగర్ లో శ్రీవాణి అనే మహిళ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఇవానియా బ్యూటీ పార్లర్ ను ఆయన టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు తమకు తామే అవకాశాలను సృష్టించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు సంకల్పం…

Read More