కూటమి ప్రజాప్రతినిధులతో కొనసాగుతున్న విందు సమావేశాలు.

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు కుటుంబ విలువలకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు ఉండవల్లి నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ విందు సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా నది ఒడ్డున గోదావరి జిల్లా అతిథులకు మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆత్మీయ కలయిక వనభోజనాలను తలపించింది. పెద్దల మాటలు, పిల్లల ఆటలు, మహిళల పలకరింపులతో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన…

Read More

గవర్నర్ ను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను శుక్రవారం సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో గౌరవ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు.

Read More

హెరిటేజ్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ.

హెరిటేజ్ ఫుడ్స్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వ‌ర్ణాంధ్ర పీ4 ఫౌండేష‌న్ వైస్ చైర్మన్ పి. కుటుంబరావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. ఒక పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా ఫిక్షన్ రైటింగ్ తప్ప వాస్తవాలు ఏమీ లేవని విమర్శించారు. ప్రజలు చదివేది నిజమా కాదా అన్న కనీస బాధ్యత లేకుండా వార్తలు వండివార్చడం బాధాకరమన్నారు.. హెరిటేజ్…

Read More

ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.

మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు…

Read More

కుప్పం లో పీ4 బంగారు కుటుంబాలుమార్గదర్శులతో సీఎం సమావేశం.

కుప్పంలోని మూడు మండలాలను దత్తత తీసుకున్న మెఘా ఇంజనీరింగ్, అదానీ ఫౌండేషన్, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి. రామకుప్పం మండలంలో ప్రస్తుతానికి 100 కుటుంబాలకు జీవనోపాధి చూపించామని తెలిపిన మెఘా ఇంజనీరింగ్ ప్రతినిధి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి మెఘా ఇంజనీరింగ్ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపిన ఎంఈఐఎల్ ప్రతినిధి. బంగారు కుటుంబాలకు ఆదాయం పెంచేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడి. ప్రతి వంద కుటుంబాలకు ఓ బంగారు మిత్రను నియమించుకున్నామని…

Read More

మీర్జాపురం రాణి-కృష్ణవేణి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.

అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆ తరం నటీమణి, గాయని స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. మహానటుడు ఎన్ . టి. రామారావు ని మనదేశం సినిమా ద్వారా…

Read More

గన్నవరం విమానాశ్రయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు.

విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకుని మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన యువత దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న లోకేష్ కు ఘనస్వాగతం పలికిన యువత రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన కోసం మంత్రి నారా లోకేష్ చేసిన కృషి పట్ల ప్లకార్డులు చేతబూని ధన్యవాదాలు తెలిపిన యువత ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.

Read More

పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి.

రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై తెలంగాణ సీఎం, ఏపీ మంత్రి చర్చలు -తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పరిశీలించాలని ఏపీ విద్యామంత్రిని కోరిన తెలంగాణ సీఎం పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. దావోస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపిక‌ను అందజేశారు….

Read More

రేపు హైదరాబాద్ కు చేరుకోనున్న ముఖ్యమంత్రి.

మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గోన్న సీఎం ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం ప్రపంచ ఆర్ధిక సదస్సులో నిర్వహించిన 9కి పైగా సెషన్స్, సమావేశాలకు హాజరైన…

Read More

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం.

ఆదివారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి కార్యక్రమాన్ని ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా లెజెండరీ బ్లెడ్‌ డొనేషన్‌ అండ్‌ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకవిశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్‌ నందమూరి తారక రామారావు కి ఆత్మీయ నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈ సందర్భంగా…

Read More