మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీతో ప్రతిభ చూపించిన జలమండలి ఇప్పుడు AI ఆధారిత టెక్నాలజీతో డీ సిల్టింగ్ పనులను నిర్వహించడానికి ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
శుక్రవారం ఓ అండ్ ఎం డివిజన్-2 పరిధిలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కలిసి ఈ టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
శాటిలైట్ ఆధారిత, జీఐఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ టెక్నాలజీతో మ్యాన్ హోల్ వద్ద మానవ రహిత ఆటోమేటిక్ పొజిషనింగ్ తో డీ సిల్టింగ్ పనులు వేగంగా పూర్తి చేయవచ్చని ఎండీ, ఈడి ఈ సందర్భంగా వివరించారు.
ఇప్పటికే ఎలాంటి వ్యయం లేకుండా 90 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రోగ్రాంతో విప్లవాత్మక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన జలమండలి ఈ టెక్నాలజీతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
టెక్నాలజీ ముఖ్య అంశాలు:*
నిలువు మాన్హోల్స్తో పాటు అడ్డంగా ఉన్న పైప్లైన్లను శుభ్రం చేసే సెల్ఫ్ డిటెక్టివ్ తో రోబోటిక్ వ్యవస్థలు
మాన్ హాలో లో అడ్డంకులు ఏర్పడే ముందే అంచనా వేసి నివారించే AI ఆధారిత ప్రిడిక్షన్ & ప్రివెంటివ్ అవకాశం.
శాటిలైట్ మరియు GIS సమన్వయంతో అండర్గ్రౌండ్ సీవరేజ్ వ్యవస్థకు లైవ్ డిజిటల్ మ్యాప్ అనుసంధానం.
నగరవ్యాప్తంగా పారిశుధ్య కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, ట్రాక్ చేయడానికి మరియు ప్రణాళిక రూపొందించడానికి సహాయపడే రియల్-టైమ్ డాష్బోర్డ్స్ సాంప్రదాయ వ్యవస్థలతో అనుసంధానం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకతలు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భార్గవ, సీజిఎం నాగేందర్, జీఎం శ్యాం సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
