ఖాజాగూడ చెరువు కబ్జాల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయడం.. డైవర్ట్ చేయడంపై మీడియాలో వచ్చిన కథనాలతో పాటు.. ప్రజల నుంచి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖాజాగూడ చెరువు అలుగుతో పాటు తూములు మూసేయడం డైవర్ట్ చేసినట్టు గుర్తించారు. ఖాజాగూడ చెరువు కింద భాగంలో దీనికి అనుసంధానంగా ఉన్న చిన్న చెరువు రూపురేఖలు మార్చినట్టు గుర్తించారు. చెరువు ఆనవాళ్లు లేకుండా చేయడాన్ని గమనించారు. అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొంతమంది ఆక్రమించుకుని షెడ్డులు నిర్మించినట్టు గుర్తించారు. తమది భూమి అంటున్నవారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించాలని హైడ్రా నిర్ణయించింది.
ఖాజాగూడ చెరువు కబ్జాలపై హైడ్రా దృష్టి.
