కూటమి ప్రజాప్రతినిధులతో కొనసాగుతున్న విందు సమావేశాలు.
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు కుటుంబ విలువలకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు ఉండవల్లి నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ విందు సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా నది ఒడ్డున గోదావరి జిల్లా అతిథులకు మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆత్మీయ కలయిక వనభోజనాలను తలపించింది. పెద్దల మాటలు, పిల్లల ఆటలు, మహిళల పలకరింపులతో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన…
