పోలవరానికి పర్యాటక శోభ,.అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు,
అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్తో పాటు… గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతో పాటు….ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం డవల్మెంట్కు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారలుతో పాటు ఏజెన్సీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు….
