మణికొండ తెలంగాణ కానుక
మణికొండ, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో నిర్వహించిన పలు వివాహాలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీశ్రీ ఈ సందర్భంగా నూతన వధూవరులకు, నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ, వారి కుటుంబ శుభకార్యాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లక్ష్మీశ్రీ తెలిపారు.
