ఇండస్ వ్యాలీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా చంద్రశేఖర్ ఉప్పులేటి, ఉపాధ్యక్షులుగా ఎం.డి. వాజిద్, బలరామ కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా విజయ్ ఆనంద్, కోశాధికారిగా ప్రభాకర్, సంయుక్త కార్యదర్శిగా వై. నాగేందర్, సాంస్కృతిక కార్యదర్శిగా మణిదర్ స్వర్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం. ఆదిత్య, రవి కంబాల ఎన్నికయ్యారు.
కాలనీ వాసుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక–సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని ఐక్యతతో ముందుకు సాగుతామని నూతన కార్యవర్గం తెలిపింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
