పోటీలపై సీఎం రేవంత్ సమీక్ష,.
తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరి గారితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణా రావు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్ చైర్మన్ శివసేనా రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఎండీ ఎ. సోనీబాల దేవి గారు పాల్గొన్నారు.
