నార్సింగి తెలంగాణ కానుక
నార్సింగి సర్కిల్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం సర్ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓ లు గోదా మంజుల రవీందర్ రెడ్డి చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యక్రమాన్ని పరిశీలించిన బీ ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దపులి కృష్ణ కిషన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నింపిన ఫారాలను వెంటనే సంబంధిత అధికారులకు ఇవ్వాలని ఓటర్లకు సూచించారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న వాటికి సంబంధించి ఫోన్ల ద్వారా సంప్రదించి ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూసుకోవాలని సంపూర్ణంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిచేయాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దపల్లి కిషన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తలారి మై కృష్ణ ,
డప్పు రాకేష్ ,
వై.ప్రకాష్ ,ఆర్ దేవదాస్ డప్పు. రవీందర్ ,
సిహెచ్ .యాదయ్య,
దాకురి వంశీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
