రైలులో స్టార్ తాబేలు పట్టివేత.

Spread the love

నిందితుడికి 14 రోజుల రిమాండ్…….

ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న స్టార్ తాబేలును రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది పట్టుకున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం రావడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అడ్డగుట్టకు చెందిన సురేష్ కుమార్ (32) అనే ప్రయాణికుడు భువనగిరి నుంచి సికింద్రాబాద్‌కు వస్తూన్నప్పుడు తనిఖీలలో భాగంగా తను తాబేలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని RPF పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తరువాత ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వారు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు..న్యాయస్థానం నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు హైద్రాబాద్ డీఎఫ్ఓ శ్రీనివాస్ తెలిపారు..


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *