శుభాకాంక్షలు తెలిపిన నీరుడు శేఖర్ ముదిరాజ్
బండ్లగూడ ఫిబ్రవరి 26 తెలంగాణ కానుక
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషుల సమక్షంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిస్మత్పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు నిరుడు శేఖర్ ముదిరాజ్ కొండా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని ప్రశంసించారు.ఆయన ఆయురారోగ్యాలతో, మరింత ప్రజాదరణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు మహేష్ , మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నాయక్ , నిరుడు పవన్ సాయి, నరేష్, సాయి, లక్ష్మణ్, సందీప్ యాదవ్, ఉదయ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
