తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సిట్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యాన కొత్తగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, నాయకులు శాంతి నాయక్,కార్యకర్తలు గులాబీ,నల్ల కండువాలు ధరించి రేవంత్ రెడ్డి సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.
ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యాన కొత్తగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీ.
