గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ఐక్యత అభివృద్ధి ప్రేరణనిస్తూ జాతీయ జెండా పండుగను జరుపుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: జాతీయ జెండా ఆవిష్కరించినచైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్.
