మణికొండ తెలంగాణ కానుక
మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మణికొండ డివిజన్ పరిధిలో డ్వాక్రా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు,
ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇందిరమ్మ చీరలను అందుకున్నారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో మణికొండ మాజీ సర్పంచ్ యాలాల నరేష్ , మాజీ కౌన్సిలర్ యాలాల లావణ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బషీర్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎర్పుల కుమార్ , లక్ష్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రవణ్ కుమార్ , పుల్లారావు మణికొండ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సావిత్రి , ఏ-బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
