బండ్లగూడ తెలంగాణ కానుక
ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని మాజీ కార్పొరేటర్ షాపురం శ్రీనాథ్ రెడ్డి అన్నారు. హైడర్షాకోట్ 123వ డివిజన్ పరిధిలో రహదారులు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను గుర్తించిన మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి టింకు రెడ్డి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ ఎంపీటీసీ సంతోష్ కుమార్ మాజీ వార్డ్ సభ్యుడు రవికాంత్ రెడ్డి
సతీష్ యాదవ్ యాదగిరి లడ్డు తదితరులు పాల్గొన్నారు.
