- ప్రతి ఓటరు తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలి
- ఎంఆర్ఓ ఫహీం
ఆమనగల్లు, తెలంగాణ కానుక:
ఆమనగల్లు మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్ఓలు అర్హులైన ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారమ్లను సేకరించి వివరాలను పరిశీలించారు.ప్రతి ఓటరు తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ- వెంకటయ్య, ఆస్ఐ,రెవెన్యూ సిబ్బంది,లు పాల్గొన్నారు.
