అంతర్వేది తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఓ పశువు మృతి చెందిన ఘటన పర్యావరణ కాలుష్యంపై ఆందోళన కలిగిస్తోంది. ఆకలితో పశువు ప్లాస్టిక్ సంచులను ఆహారంగా భావించి మింగడంతో ప్రాణాలు కోల్పోయింది. జంతువు శరీరం కుళ్లి అస్థిపంజరంగా మారినా, దాని కడుపులోని ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండటం ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో చాటిచెబుతోంది. నిర్లక్ష్యంగా పారేసే వ్యర్థాల వల్ల వేలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్లాస్టిక్ మృత్యుజాలం: అంతర్వేదిలో అస్థిపంజరంగా మారిన పశువు
