రూ. 4.76 కోట్ల గంజాయి కాల్చివేత..

Spread the love

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసుల్లోని 953 కేజీల గంజాయిని కాల్చివేతకు ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు స్టేషన్లలో కేసుల వారిగా గంజాయిని ఒక దగ్గరకు చేర్చి మొత్తంగా 953 కేజీల గంజాయిని ప్రభుత్వ అమోదిత ఏడబ్ల్యూఎం కన్సంటింగ్ లిమిటేడ్ కాల్చివేత పరిశ్రమలో సోమవారం కాల్చివేశారు.

ఈ కంపెనీతల్లేడ మండలం గోపాల్‌పేట్‌లో ఉంది. కాల్చివేసిన గంజాయి విలువ రూ. 4.76 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం 1 ఎక్సైజ్ స్టేషన్‌లో 9 కేసుల్లో 42 కేజీలు, ఖమ్మం `2 స్టేషన్‌లో5 కేసుల్లో 57 కేజీల, మధిర స్టేషన్‌లోని 7 కేసుల్లో 193 కేజీల, కొత్తగూడం జిల్లాలోని పాల్వంచ స్టేషన్‌లో 2 కేసుల్లో 114 కేజీలు, మణుగూర్ స్టేషన్‌లో ఒక కేసులో 21 కేజీలు, భద్రాచలం స్టేషన్‌లో 23 కేసుల్లో 625 కేజీల గంజాయిని కాల్చి వేసినట్లు డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *