వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న‌హైడ్రా క‌మిష‌న‌ర్‌.

Spread the love

ములుగు జిల్లా మేడారం మ‌హాజాత‌ర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు కుటుంబ స‌మేతంగా వెళ్లారు. సమ్మక్క- సారలమ్మ వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకుని మొక్కులు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవతలను ప్రార్థించారు. మేడారం జాతర విశిష్టతను గుర్తుచేస్తూ, ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మేడారం జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తూ.. ప్రజల మధ్య ఐక్యతను చాటిచెబుతుంద‌న్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *