మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా
బాపుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారితో కలిసి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
జాతిపిత మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.
అహింసను ఆయుధంగా,
సత్యాన్ని మార్గంగా,
శాంతిని సందేశంగా తీసుకుని
దేశానికి దిశ చూపిన గాంధీజీ బాట
నేటికీ సమాజానికి నిరంతర స్ఫూర్తిగా నిలుస్తోంది.
గాంధీజీ చూపిన మార్గదర్శకత్వంలోనే
ప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన సాగిస్తోందని
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు.
గాంధీజీ ఆలోచనలు నేటి ప్రభుత్వానికి
దిశానిర్దేశం, స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
