కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Spread the love

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ—
ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం అనే విలువలతో 141 సంవత్సరాలుగా దేశానికి సేవలందిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *