బయ్యారం,తెలంగాణ కానుక,జులై 8.
గ్రామ సమస్యలు,పరిపాలన,అభివృద్ధి తదితర అంశాలపై సర్పంచులకు,పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం బుధవారం మొదలైంది. జిల్లాలో గ్రామ పంచాయతీల ప్రథమ పౌరులకు మొదటి విడత ఐదు శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ అధికారి దివ్య,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క,ఎంపీ బలరామ్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొని సర్పంచ్ లకు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బయ్యారం సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్,జగ్గుతండా సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ పాల్గొని బయ్యారం,జగ్గుతండా గ్రామపంచాయతిలలో పలు సమస్యలపై మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందించినట్లు తెలిపారు.
