అభివృద్ధికి పట్టం కట్టండి,

Spread the love

కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని 11వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ‘ప్రజా ప్రభుత్వం’ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. పట్టణ రూపురేఖలు మార్చాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. “ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉంది. ఈ సమయంలో కొల్లాపూర్ రూపురేఖలు మార్చేలా నిధులు మంజూరు చేయిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారనే నమ్మకం నాకుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కొల్లాపూర్‌ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే విద్యా, వైద్య రంగాలతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదలకు కృషి చేశామని మంత్రి గుర్తు చేశారు. కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులతో పట్టణాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *