గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు నిలవెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది.
భక్తులందరూ ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకుని తిరిగి ఇంటికి చేరుకోవాలి.
అమ్మవార్ల దయవల్ల అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
