యాదగిరిగుట్ట నూతన ఈవో భవాని శంకర్ శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఇటీవల కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రమోషన్ పొందిన భవాని శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
